వేసవిలో జరిగే చోరీలపై ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించాం. ఎల్హెచ్ఎంఎస్(లాక్డ్ హౌస్ మాని టరింగ్ సిస్టమ్) అమలులో ఉంది. దీన్ని స్మార్ట్ఫోన్లోని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అందులో అడిగిన వివరాలివ్వాలి. ఆపై ఎప్పుడు ఊరెళుతున్నారు, ఎన్నా ళ్లు రారు తగిన వివరాలను అందులో ఎంట్రీ చేయాలి. పోలీసులు ఆ ఇంటి వద్ద సీసీకెమరా అమర్చి దాన్ని పోలీసు మానిటిరింగ్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేస్తారు. చోరీ చేసిన వాళ్లను పట్టుకునే అవకాశం ఉంటుంది. – డేగల ప్రభాకర్, డీఎస్పీ, పలమనేరు


