– 8లో
– 8లో
– 8లో
కలప లోడుతో వెళుతూ ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో వ్యక్తి దుర్మరణం చెందాడు.
ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గిరిబాబుయాదవ్
చిత్తూరు కలెక్టరేట్: ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శిగా యాదమరి మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన మెరుగు గిరిబాబుయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరులోని గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం ఆ సంఘం జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గిరిబాబు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన వంతు కృషిచేస్తానని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకు పలువురు టీచర్లు, సంఘ నాయకులు అభినందనలు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు బాబు, సంఘ నేత లు దేవానంద్, నాథముని, త్యాగరాజు, గుర్రప్ప, లత, రెడ్డివాణి, శివరంజని పాల్గొన్నారు.


