తమ్ముళ్లు బిల్లులు కోసం నాసిరకంగా పనులు చేసి వదిలేశారు. అనేక చోట్ల సీసీ రోడ్లు ఇప్పటికే పగళ్లు వచ్చాయి. వీటిపై పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్లు కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల పనులను ఇంకా చెక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తయిన పనులకు వంద శాతం బిల్లుల చెల్లింపు జరగద ని, మొత్తం బిల్లుల్లో 15 శాతాన్ని డిపాజిట్గా ఉంచుకొని, క్వాలిటీ చెక్ చేసిన అనంతరం మొత్తాన్ని విడుదల చేస్తామని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.


