పదిలో బీవీకే విద్యార్థుల ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

పదిలో బీవీకే విద్యార్థుల ప్రభంజనం

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

తిరుపతి సిటీ: తిరుపతి బైరాగిపట్టెడలోని బీవీకే విద్యా సంస్థల విద్యార్థులు గురువారం విడుదలైన పదో తరగతి పలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా సీఈఓ అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ బీవీకే విద్యార్థులు పది ఫలితాల్లో రికార్డు స్థాయిలో మార్కులు సాధించి, ప్రబంజనం సృష్టించారని తెలిపారు. విద్యార్థులు కే వినతి 597, జాహ్నవి 595, జోష్యంత్‌ 592, మాన్యసాయి 591 సాధించారని చెప్పారు. 570 మార్కులకు పైగా 102 మంది విద్యార్థులకు రావడం పాఠశాలకు గర్వకారణమన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తమ పాఠశాల లక్ష్యమని చెప్పారు. నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులను మెరిట్‌ స్టూడెంట్స్‌గా తీర్చిదితున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందించారు.

కౌంటింగ్‌ పరిశీలకులుగా డీఆర్వో

చిత్తూరు కలెక్టరేట్‌: కేరళ రాష్ట్రంలోని అలెప్పి జిల్లా హరిపాడ్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్‌ పరిశీలకులుగా డీఆర్వో మోహన్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆయన ఈ నెల 3, 4, 5 తేదీల్లో అక్కడ విధులు నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement