
సంక్రాంతిపల్లెలో దొంగల బీభత్సం
● అయిదు ఇళ్లలో చోరీలు ● రెండు ఇళ్లల్లో బీరువాలను దర్జాగా తీసుకెళ్లి దోచుకున్న వైనం ● 81 గ్రాముల బంగారం, రూ .1.80 లక్షల నగదు అపహరణ
బంగారుపాళెం : మండలంలోని సంక్రాంతిపల్లెలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడి గ్రామంలోని 5 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 లక్షల విలువైన నగలు, నగదు అపహరించుకుపోయారు. రెండిళ్లల్లోని బీరువాలను గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ ధ్వంసం చేసి నగలు, నగదు దోచుకుపోవడం గమనార్హం. జాతీయ రహదారికి కూత వేటు దూరంలో గల గ్రామంలో నిందితులు దర్జాగా చోరీకి పాల్ప డడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, గ్రా మస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంక్రాంతిపల్లెలో అర్ధరాత్రి సమయం గుర్తుతెలియని వ్య క్తులు గ్రామానికి చెందిన ఉమేష్, మునిరత్నం, శాంతమ్మ, ఇళ్లతో పాటు దళితవాడలోని మునెయ్య, చిట్టిబాబు ఇళ్లల్లో ఇంటి తాళాలను పగులగొట్టి లోపలికు ప్రవేశించారు. ఉమేష్, మునిరత్నం ఇళ్లలోని బీరువాలను గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ పగులగొట్టా రు. ఉమేష్ బీరువాలో రూ. 2 లక్షల నగదు, 60 గ్రా ముల బంగారు ఆభరణాలు, మునిరత్నంకు చెందిన బీరువాలో రూ.15 వేల రూపాయలు నగదు, 16 గ్రా ముల బంగారు నగలు అపహరించారు. శాంతమ్మ ఇంటిలో పెట్టెలను పగులగొట్టి చూశారు. ఏమీ లేకపో వడంతో వెళ్లిపోయారు. దళితవాడలో మునెయ్య ఇంటిలో రూ.2 వేల రూపాయల నగదు, బంగారు కమ్మలు(జత) రెండు గ్రాములు, చిట్టిబాబు ఇంట్లో మూడు గ్రాముల విలువైన మూడు జతల కమ్మలు, 2,500 రూపాయల నగదు దోచుకుపోయారు. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో గ్రామానికి చెందిన మోహన్ టిఫిన్ దుకాణం నిర్వహించేందుకు ఇంటి నుంచి బయటకు రావడంతో నలుగురు వ్యక్తులు ఉ మేష్ ఇంటి వద్ద ఉండడంతో కేకలు వేయడంతో దొంగలు పారిపోయినట్లు తెలిపారు. చోరీ సమాచారం అందుకున్న బంగారుపాళెం సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రమేష్, సిబ్బంది సంక్రాంతిపల్లె గ్రామానికి చేరుకున్నారు. చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. బాధితు లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిట్టపల్లె గ్రామంలో మహాభారత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హరికథకు స్థానికులు వెళ్లినట్లు తెలిపారు. ఉమేష్, మునిరత్నం ఇళ్లకు తాళాలు వేసు కుని మిద్దైపెన నిద్రపోయినట్లు తెలిపారన్నారు. సంఘటనా స్థలాన్ని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ సందర్శించారు. చిత్తూరు నుంచి క్లూస్టీమ్ సభ్యులు చోరీ జరిగిన ఇళ్లలో వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.