
తహసీల్దార్ హుస్సేన్ సస్పెన్షన్
చిత్తూరు కలెక్టరేట్ : ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన స దుం ఇన్చార్జ్ తహసిల్దార్ హుస్సేన్ సస్పెండ్ అయ్యా రు. ఈ మేరకు గురువారం కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ సస్పెండ్ ఉత్త ర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు సదుం వీఆర్వో మహబూబ్ బాషాను సైతం సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆ మండలానికి నూతన తహసీల్దార్ నియమించే వరకు ప్రస్తుతం పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కు మార్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్న ట్లు పేర్కొన్నారు.
హెల్మెట్ విధిగా పెట్టుకోండి
చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ సూచించారు. రోడ్డు భద్రతా అవగాహనలో భాగంగా గురువా రం చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద హెల్మెట్ ర్యాలీ, రోడ్డు భద్రతపై రూపొందించిన పాటను ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇ టీవల స్కూటరిస్టులు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కు వ మంది మరణిస్తున్నారని, హెల్మెట్ వాడకపోవడమే ఇందుకు కారణమన్నారు. గత ఐదేళ్లలో 350 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే, 170 మంది వరకు ద్విచక్ర వాహన చోదకులే ఉండటం ఆలోచించాల్సిన విషయమన్నారు. రోడ్డు భ ద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. ఇక పాటను రూపొందించడంలో శ్రద్ధ చూపించిన ట్రాఫిక్ సీఐ నిత్యబా బును ఎస్పీ అభినందించారు. ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్ భాష, ఈస్ట్ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐలు భాస్కర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కార్వేటినగరం: గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కార్వేటినగరం త్యాగరాజ పిళ్లై వీధికి చెందిన చిన్నిరెడ్డి కుమారుడు గోపాల్(52) కొన్నాళ్లుగా గొంతు క్యాన్సర్ వ్యాఽధితో బాధపడుతున్నాడు. గురువారం ఆ బాధ ఎక్కువ కావడంతో తాళలేక అతనే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు అతనిని ప్రైవేటు వాహనంలో స్థానిక సీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథ మ చికిత్స చేసి, తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. అతన్ని రుయాకు తరలించారు. ప్రస్తు తం అతను రుయాలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.