షావోమి అద్భుత ఆవిష్కారం

Xiaomi unveils ludicrous transparent OLED TV  - Sakshi

ట్రాన్సపరెంట్ టీవీ..ఒక గ్లాస్ కళాఖండం

సాక్షి, న్యూఢిల్లీ: టెలివిజన్ మార్కెట్లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్న షావోమి మరో కొత్త ఆవిష్కారానికి తెర తీసింది. ఎడ్జ్-టు-ఎడ్జ్  ట్రాన్స్ పరెంట్  గ్లాస్ డిస్ ప్లేతో, దృశ్యాలు గాలిలో తేలిపోతున్న అనుభూతిని కలిగించేలా అద్భుతమైన ఎంఐ టీవీలను లాంచ్ చేసింది. 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ టీవీలను ప్రదర్శించింది.

ఎంఐ టీవీ లగ్జరీ ట్రాన్సపరెంట్ ఎడిషన్ టీవీలను 55 అంగుళాల సైజులోమాత్రమే  తీసుకొచ్చింది. వర్చువల్,  రియల్‌ను విలీనం చేసి అపూర్వమైన అనుభవాన్ని అందించేలా ఈ టీవీలను డిజైన్ చేసింది.  టీవీ మాత్రమే కాకుండా, దీన్ని ఆఫ్ చేసినపుడు ఆర్ట్ పీస్ గా కనిపించే ఎంఐ టీవీ లక్స్ ట్రాన్సపరెంట్ ఎడిషన్  గ్యాలరీలు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్ , థియేటర్లకు కూడా చక్కగా అమరిపోతుందని  షావోమి ప్రకటించింది.

బ్యాక్ ప్యానెల్‌తో వచ్చే సాంప్రదాయ టీవీల మాదిరిగా కాకుండా, అన్ని ప్రాసెసింగ్ యూనిట్లను దాని బేస్ స్టాండ్‌లో సృజనాత్మకంగా పొందుపర్చడం విశేషం. అందుకే ఈ టీవీని ఆఫ్ చేసిన  బోర్డర్, బేస్, తప్ప మిగిలిన సెట్ పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. దీంతో ఈ తరహా టీవీలను భారీగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే తొలి సంస్థగా షావోమి ఖ్యాతిని దక్కించుకుంది. ఆగస్టు 16 న చైనాలో ఈ టీవీల అమ్మకాలు ప్రారంభ మైనాయి. 7వేల డాలర్లు..అంటే సుమారు 5,23,982 రూపాయలు. మిగిలిన ఆసియా మార్కెట్లలో ఇవి అందుబాటులోకి వచ్చేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top