న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 31 శాతం జంప్చేసి రూ. 632 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 481 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం వృద్ధితో రూ. 12,085 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 10,379 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. వాటాదారులకు షేరుకి 1.75 డివిడెండ్ ప్రకటించింది. జులై 7న వార్షిక వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 1,439 కోట్లనుంచి రూ. 2,156 కోట్లకు ఎగసింది. ఇక మొత్తం ఆదాయం 28 శాతం మెరుగుపడి రూ. 42,576 కోట్లకు చేరింది.
2020–21లో రూ. 33,239 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. క్యూ4లో ఎక్సెప్షనల్ ఐటమ్స్కు ముందు కన్సాలిడేటెడ్ నికర లాభం 76 శాతం జంప్చేసి రూ. 775 కోట్లకు చేరగా.. పూర్తి ఏడాదికి 61 శాతం అధికంగా రూ. 2,298 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది.
టాటా పవర్ లాభం అప్
Published Sat, May 7 2022 10:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
Advertisement