TodayStockMarketUpdate:ఎట్టకేలకు జోష్‌లోకి: మురిపించిన మార్కెట్‌

Sensex ends higher Nifty settled above 17800 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభం నుంచి పాజిటివ్‌గా సూచీలు ఆ తరువాత మరింత కోలుకున్నాయి. దాదాపు అన్ని  రంగాల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 910 పాయింట్లు ఎగిసి 60842  నిఫ్టీ 244 పాయింట్ల లాభంతో 17854వద్ద స్థిరపడ్డాయి.  

అదానీ పోర్ట్స్‌, టైటన్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ భారీగా లాభ పడగా, దివీస్‌ లాబ్స్‌, బీపీసీఎల్‌, టాటా కన్జూమర్‌, హిందాల్కో,ఎన్‌టీపీసీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపీ 34 పైసలు లాభంతో 81.83 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top