రూ. 1,000 కోట్లు జమ చేయండి | SC directs Sahara Group to deposit Rs 1000 crore | Sakshi
Sakshi News home page

రూ. 1,000 కోట్లు జమ చేయండి

Sep 6 2024 4:30 AM | Updated on Sep 6 2024 8:19 AM

SC directs Sahara Group to deposit Rs 1000 crore

సెబీ కేసులో సహారాకు సుప్రీం ఆదేశం 

ముంబైలోని భూ విక్రయం ద్వారా రూ.10,000కోట్ల సమీకరణకు వెసులుబాటు 

న్యూఢిల్లీ: గ్రూప్‌ సంస్థల రూ.25,000 కోట్ల అక్రమ డిపాజిట్‌ సమీకరణకు సంబంధించి  సెబీ కేసులో 15 రోజుల్లోగా రూ. 1,000 కోట్లను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సహారా గ్రూప్‌ కంపెనీలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దీనితోపాటు రూ.10,000 కోట్ల సమీకరణకుగాను ముంబైలోని వెర్సోవాలో తన భూమిని అభివృద్ధి చేయడానికి, ఈ విషయంలో జాయింట్‌ వెంచర్‌ ఒప్పందంలోకి ప్రవేశించడానికి సైతం సుప్రీం అనుమతించింది. అత్యున్నత న్యాయస్థానం 2012 ఆదేశాలకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇవ్వడానికి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని సెబీ–సహారా రిఫండ్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.  

లేదంటే.. భూమి విక్రయానికి స్వయంగా చర్యలు 
జాయింట్‌ వెంచర్‌/డెవలప్‌మెంట్‌ ఒప్పందాన్ని 15 రోజుల్లోగా కోర్టులో దాఖలు చేయాల్సి చేయాలి. అనంతరం ఈ ఒప్పందానికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర తప్పనిసరి. లేని పక్షంలో  వెర్సోవాలోని 12.15 మిలియన్‌ చదరపు అడుగుల భూమిని విక్రయించడానికి సుప్రీం తగిన చర్యలు తీసుకుంటుందని న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, ఎంఎం సుందరే‹Ù, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 

‘‘సహార సంస్థలు– ఎస్‌ఐఆర్‌ఈసీఎల్, ఎస్‌హెచ్‌ఐసీఎల్‌ (రెండూ సహారా గ్రూప్‌ కంపెనీలు)కు మేము 15 రోజుల సమయం మంజూరు చేస్తున్నాము. జాయింట్‌ వెంచర్‌/డెవలప్‌మెంట్‌ ఒప్పందాన్ని 15 రోజులలోపు దాఖలు చేయకపోతే,  వెర్సోవా భూమిని  విక్రయానికి కోర్టు చర్యలు చేపడుతుంది’’ అని బెంచ్‌ పేర్కొంది. ‘‘ఈ పక్రియ కోసం థర్డ్‌పారీ రూ. 1,000 కోట్లు జమచేస్తే, దీనిని సెబీ ఎస్క్రో ఖాతాలో ఉంచడం జరుగుతుంది.  ఒకవేళ ఈ కోర్టు ఆమోదం/అనుమతి (జాయింట్‌ వెంచర్‌ అగ్రిమెంట్‌కు) మంజూరు చేయకపోతే, ఆ మొత్తాన్ని (జమ చేసిన మొత్తాన్ని) తిరిగి థర్డ్‌పారీ్టకి చెల్లించడం జరుగుతుంది’’అని కూడా ధర్మాసనం వివరించింది.

చెల్లింపులకు 10 యేళ్ల సుదీర్ఘ వెసులుబాటు 
రూ.25,000 కోట్ల తిరిగి డిపాజిట్‌ చేయడానికి సహారాకు సుప్రీం దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇచ్చి ఎంతో వెసులుబాటు కలి్పస్తున్న విషయాన్ని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా సంస్థ తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్‌ సిబల్‌కు గుర్తు చేసింది. ఇదే కేసులో సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతోరాయ్‌ సుదీర్ఘకాలం తీహార్‌ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం గమనార్హం. తల్లి మరణం అనంతరం అంతిమ సంస్కారాల కోసం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచి్చన ఆయన, కొద్ది నెలల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement