2000 బెడ్‌లతో మెడికల్ సిటీ.. నీతా అంబానీ కీలక ప్రకటన | Reliance Foundation Building 2000 Beds Medical City in Mumbai Says Nita Ambani | Sakshi
Sakshi News home page

2000 బెడ్‌లతో మెడికల్ సిటీ.. నీతా అంబానీ కీలక ప్రకటన

Aug 29 2025 5:05 PM | Updated on Aug 30 2025 8:16 AM

Reliance Foundation Building 2000 Beds Medical City in Mumbai Says Nita Ambani

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్.. ముంబై నడిబొడ్డున 2,000 పడకల అత్యాధునిక మెడికల్ సిటీ నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని 'నీతా అంబానీ' రిలయన్స్ ఫౌండేషన్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.

సంస్థ నిర్మిస్తున్న మెడికల్ సిటీ, కేవలం మరో హాస్పిటల్ మాత్రమే కాదు. ఇది భారతదేశ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు కొత్త మార్గదర్శి. ఇక్కడ ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్, లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ వంటివాటితో పాటు.. ప్రపంచంలోని కొంతమంది అత్యుత్తమ వైద్యులు ఉంటారని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్‌పర్సన్ నీతా అంబానీ పేర్కొన్నారు.

భవిష్యత్ తరాల ఆరోగ్య సంరక్షణ కోసం, నిపుణులను పెంపొందించడమే లక్ష్యంగా.. ఈ మెడికల్ సిటీలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఉంటుందని నీతా అంబానీ పేర్కొన్నారు. ఇది మన దేశానికి గర్వకారణమవుతుందని, ప్రపంచమే మనవైపు చూస్తుందని అన్నారు. ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల సేవలను గుర్తుచేసుకుంటున్న సందర్భంగా నీతా అమ్బనీ ఈ ప్రకటన చేశారు.

ఇదీ చదవండి: జియో ఐపీఓ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ముకేశ్ అంబానీ

భారతదేశంలోని అగ్రశ్రేణి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన 'సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్' ఇప్పటివరకు 3.3 మిలియన్లకు పైగా రోగులకు సేవలందించింది. ఇందులో కూడా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి వాటికోసం జీవన్ అనే కొత్త విభాగం ప్రారంభించనున్నట్లు.. లేటెస్ట్ పీడియాట్రిక్ ఆంకాలజీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు నీతా అంబానీ వివరించారు.

కోస్టల్‌ రోడ్డు గార్డెన్‌లు

ముంబైవాసులను పకృతికి దగ్గర చేసే మరో ఆసక్తికర అభివృద్ధి కార్యక్రమాన్ని నీతా అంబానీ ప్రకటించారు. నగరంలో కోస్టల్‌ రోడ్డు గార్డెన్‌లు తీర్చిదిద్దే కార్యక్రమాన్ని రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సముద్ర తీర రోడ్ల చెంతన సుమారు 130 ఎకరాల్లో పచ్చని, ఆహ్లాదాన్ని పంచేలా ఉద్యాన వనాలు, వాక్‌వేలు, సైక్లింగ్‌ ట్రాక్‌లు నిర్మిస్తున్నట్లు వివరించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement