నాలుగో రోజూ- రికార్డులతో షురూ

Market open with new highs- Realty jumps - Sakshi

284 పాయింట్లు అప్‌‌‌- 47,258కు సెన్సెక్స్‌

90 పాయింట్లు పెరిగి 13,839 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే‌- రియల్టీ జూమ్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం ప్లస్‌

ముంబై, సాక్షి: క్రిస్మస్‌ సందర్భంగా వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమయ్యాయి. వెరసి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌  47,354ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకింది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 284 పాయింట్లు జంప్‌చేసి 47,258కు చేరగా.. ఈ బాటలో నిఫ్టీ సైతం తొలుత 13,865 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరింది. ప్రస్తుతం 90 పాయింట్లు ఎగసి 13,839 వద్ద ట్రేడవుతోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్‌, బ్యాంకింగ్‌, ఆటో 3-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌ 4-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌ అదికూడా 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!)

గోద్రెజ్‌ జూమ్‌ 
డెరివేటి స్టాక్స్‌లో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, పీవీఆర్‌, డీఎల్‌ఎఫ్, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్‌, మదర్‌సన్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, చోళమండలం, ఐబీ హౌసింగ్, జిందాల్‌ స్టీల్‌, అపోలో టైర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 4.3-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు వేదాంతా, బయోకాన్‌, ఇండస్‌ టవర్, జూబిలెంట్‌ ఫుడ్‌,  అంబుజా, అపోలో హాస్పిటల్‌, ఏసీసీ 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ దాదాపు 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,697 లాభపడగా.. 586 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top