బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ (బీబీఎన్పీఏఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా మధు నాయర్ నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి డెప్యుటేషన్పై వచ్చిన ఎండీ, సీఈవో సంజయ్ కుమార్ గ్రోవర్ స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. సంస్థ ఏఏయూఎం రూ. 57,000 కోట్ల పైచిలుకు స్థాయిలో ఉన్న తరుణంలో నాయర్ నియామకం.. ఫండ్ మరింత వేగవంతమైన వృద్ధి సాధించేందుకు దోహదపడగలదని బీబీఎన్పీఏఎం ఈడీ బీనా వహీద్ తెలి పారు. హెచ్ఎస్బీసీ, ఇన్వెస్కో, కోటక్ తదితర సంస్థల్లో నాయర్కి 28 ఏళ్ల అనుభవం ఉంది.


