స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాలు | Dialy Share Market Updats | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాలు

Jul 28 2021 10:00 AM | Updated on Jul 28 2021 10:16 AM

Dialy Share Market Updats  - Sakshi

ముంబై: ఏషియా మార్కెట్‌లలో టెక్‌ షేర్ల అమ్మకాలు భారీగా సాగుతుండటంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో దేశీ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి.  బాంబే స్టాక్‌ ఎక్సేంజీ ఈ రోజు ఉదయం 52,673 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వెనువెంటనే పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 9:50 గంటల సమయంలో 259 పాయింట్లు నష్టపోయి 52,319 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ 15,761 పాయింట్లతో మొదలై 65 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో15,681 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నెస్టల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఏషియన్‌ పేయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు భారీగా నష్టపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement