తక్కువ ధరలో ఏథర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌, ధర ఎంతంటే?

Ather launches most affordable electric scooter115 k range 450s - Sakshi

ఫేమ్‌-II  సబ్సిడీ  కోత ఆందోళనల మధ్య  ఎఫర్డబుల్‌ ధరలో

450 ఎక్స్‌ ధరలు పెంపు

సాక్షి, ముంబై: స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో కొత్త ఏథర్ 450ఎస్‌ను విడుదల చేసింది. ఫేమ్‌-II  సబ్సిడీ  కోతతో ఈవీల ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో  ఏథర్ 450ఎస్‌ పేరుతో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ. 1,29,999గా నిర్ణయించింది. బుకింగ్‌లను కూడా షురూ చేసింది. (AsmiJain ఫ్రెండ్‌ అంకుల్‌ కోసం: ఇండోర్‌ అమ్మడి ఘనత)

తమ 450 ఎస్‌ IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పరిధి 115 కి.మీ. రేంజ్‌ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 90 కి.మీవేగంతో అత్యుత్తమ సాంకేతికత, పనితీరును అందిస్తుందని ఏథర్ఎనర్జీ కో-ఫౌండర్‌, సీఈవో తరుణ్ మెహతా తెలిపారు. 

ఫేమ్‌-IIఫ్రేమ్‌వర్క్ కింద తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్  450 ఎక్స్‌  కొత్త ధరలను కూడా ప్రకటించింది. మునుపటి ధరతో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ. 1,65,000 (ఎక్స్-షోరూమ్ బెంగుళూరు)కి అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్ ప్రో ప్యాక్‌ ఏథర్ 450 ఎక్స్‌ రూ. 1.45 లక్షల నుండి రూ. 1.65 లక్షల వరకు ఉంటుంది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ. 32,000 వరకు పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top