విజిలెన్స్‌ అధికారుల విచారణ | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ అధికారుల విచారణ

Jun 9 2026 4:48 AM | Updated on Jun 9 2026 4:48 AM

పాల్వంచరూరల్‌: పాల్వంచ రేంజ్‌ పరిధిలోని పాండురంగాపురం గ్రామ శివారులో రిజర్వ్‌ ఫారెస్ట్‌లో కొట్టిన చెట్లు, అర్బన్‌పార్కులో జరిగిన అవకతవకలపై ఫారె స్ట్‌ విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ శివయ్య, రేంజర్‌ అఫ్రొజ్‌ సోమవారం విచారణ చేపట్టారు. మంగళవారం విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. ఈ విషయమై రేంజర్‌ ప్రసాద్‌ను వివరణ కోరగా.. ఫారెస్ట్‌ విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ పాండురంగాపురం శివారులో విచారణ చేశారని తెలిపారు. గత నెల 30న నారవేప చెట్టు నరకగా, కేసు కూడా నమోదు చేశామని పేర్కొన్నారు.

విద్యుత్‌ మోటార్‌ చోరీ

అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామం రాళ్లవాగు సమీపంలో రైతు స్వర్గం చంద్ర య్య పొలంలో విద్యుత్‌ మోటార్‌ను ఆదివారం రాత్రి చోరీ చేశారు. ఉదయం రైతు పొలం వద్దకు వెళ్లి చూడగా చోరీ విషయం వెలుగుచూసింది. ఇటీవల ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్‌ మోటార్లు, మోటార్ల వైరు చోరీలతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు చోరీలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

ఉరి వేసుకుని

యువకుడి ఆత్మహత్య

నేలకొండపల్లి: మండలంలోని అజయ్‌తండాకు చెందిన బానోత్‌ గోపి(24) ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సీపీఆర్‌ చేసినా ఫలితం లేక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యాన ఆమె వేధింపులు భరించలేక గోపి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వివాహిత అదృశ్యంపై కేసు

మండలంలోని ఆజయ్‌తండాకు చెందిన ఓ వివాహిత కానరావడం లేదని ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement