జిల్లా ప్రధాన
న్యాయమూర్తి ప్రేమలత
సూపర్బజార్(కొత్తగూడెం): పర్యావరణ పరిరక్షణే భావితరాలకు భద్రతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం మొక్క నాటా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం న్యాయమూర్తి జెండా ఊపి పర్యావరణ ర్యాలీని ప్రారంభించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసుశాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు,ఎన్జీఓలు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.


