కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్చిన ఉపాధ్యాయుడు | - | Sakshi
Sakshi News home page

కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్చిన ఉపాధ్యాయుడు

Jun 18 2025 3:27 AM | Updated on Jun 18 2025 3:27 AM

కుమార

కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్చిన ఉపాధ్యాయుడు

దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలోని ఎంపీపీఎస్‌లో చర్ల మండలం పులిగుండాల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నూనె ప్రభాకర్‌రావు తన కుమార్తె నూనె శృతిని మంగళవారం జాయిన్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రా వు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఉచిత విద్య, ఇతర సదుపాయాలు మెరుగ్గా ఉన్నందున తమ కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించుకున్నామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బొడ్డు నాగేశ్వరరావు, హైమావతి, ఐఆర్‌పీ రాగిణి, విద్యార్థులు పాల్గొన్నారు.

పరిశ్రమల నిర్వహణ, మార్కెటింగ్‌పై అవగాహన

చుంచుపల్లి: గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో తెలంగాణ పరిశ్రమల శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా మహిళలకు పరిశ్రమల నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్‌ మెళకువలపై మంగళవారం కొత్తగూడెంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు మాట్లాడుతూ.. ఈ అంశాలపై మరింత త్వరలో పదిహేను రోజుల పాటు సమగ్రంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆచరణీయ పరిశ్రమలకు బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎం అనురాధ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, అలీప్‌ కమిటీ సభ్యురాలు పద్మావతి, అన్నపూర్ణ, ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విత్తనాల పట్టివేత

చండ్రుగొండ: మండలంలోని బెండాలపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న రూ.9 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలు పట్టుకున్నట్లు ఏఓ వినయ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. సుజాతనగర్‌కు చెందిన డీలర్‌ బెండాలపాడులో నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు విక్రయిస్తున్నట్లు పక్కా సమా చారం మేరకు దాడి చేశామన్నారు. లైసెన్స్‌ ఏప్రాంతంలో ఉంటే అక్కడే విత్తనాలు విక్రయించాల్సి ఉంటుందని, రూ.8 లక్షలు విలువ చేసే 10 కిలోల 250 గ్రాముల మిరప విత్తనాలు, రూ.90 వేల విలువ చేసే పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏఓ ఫిర్యాదు మేరకు డీలర్‌పై కేసు నమోదుచేసిదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్చిన ఉపాధ్యాయుడు1
1/1

కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్చిన ఉపాధ్యాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement