
విష కీటకం కుట్టి బాలుడి మృతి
మణుగూరుటౌన్: ఓ విషకీటకం కుట్టి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గుట్టమల్లారంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రోజూ లాగే తల్లిదండ్రులు, అన్నతో కలిసి నిద్రపోయిన అఖిల్తేజ (10).. మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో లేచాడు. బహిర్భూమికి వెళ్లాలని, విషకీటకం కుట్టిందని, కడుపులోనొప్పిగా ఉందని రోదిస్తూ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెంటనే స్థానిక 100 పడకల ఆస్పత్రికి తరలించారు. అపస్మాకరకస్థితిలోకి వెళ్తున్న అఖిల్తేజను భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వారు వాహనంలో తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలుడి మృతితో గుట్టమల్లారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పెద్దమ్మతల్లి ఆలయ ప్రధాన అర్చకుడు మృతి
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయ ప్రధాన అర్చకుడు పురాణం పురుషోత్తమశాస్త్రి (66) గుండెపోటుతో సోమవారం రాత్రి మృతిచెందారు. గొల్ల గూడెంలో నివా సం ఉంటున్న అర్చకులు ఆలయంలో 1974 నుంచి సేవలు అందిస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేసినప్పటికీ సేవలు అందిస్తున్నారు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అమ్మవారి సన్నిధి వరకు రాగానే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, కుమార్తెలు శైలజ, స్రవంతి ఉన్నారు.
యువకుడి ఆత్మహత్య
టేకులపల్లి: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని దాసుతండా పంచాయతీ రేగులతండాకు చెందిన బానోత్ కిషన్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు బానోత్ లోకేశ్ (22) ఉన్నారు. పెద్దకుమార్తెకు పెళ్లికాగా, రెండో కుమార్తె హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటోంది. లోకేశ్ ఇంటర్ వరకు చది వి హైదరాబాద్లో అక్కతో ఉంటూ ప్రైవేట్ స్కూళ్లో పనిచేస్తున్నాడు. తండ్రికి ఆరో గ్యం బాగాలేకపోతే చూడ్దామని ఇంటికి వచ్చాడు. ఇదిలాఉండగా రెండు రోజుల కిందట తల్లిదండ్రులు గార్లకు వెళ్లి మంగళవారం ఇంటికి వచ్చి చూడగా.. లోకేశ్ ఉరివేసుకుని, మృతిచెంది ఉన్నాడు. ఎస్ఐ రాజేందర్ ఘటనా స్థలానికి చేసు కుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

విష కీటకం కుట్టి బాలుడి మృతి

విష కీటకం కుట్టి బాలుడి మృతి

విష కీటకం కుట్టి బాలుడి మృతి