వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది.
యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు సిద్ధం..
8లో
జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 1,618 పాఠశాలలు ఉండగా వాటిలో 84,817 మంది బాలురు, 83,928 మంది బాలికలు.. మొత్తం 1,68,745 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థుల యూనిఫామ్ కోసం జిల్లాకు 2.56 లక్షల మీటర్ల క్లాత్ రాగా ఇప్పటికే కుట్టడం పూర్తయి పాఠశాలలకు చేరుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో(డీఈఓ పరిధి) చదివే 62,532 మంది విద్యార్థులకు గురువారం పాఠశాలలు ప్రారంభం కాగానే ఒక్కో జత చొప్పున యూనిఫామ్ అందించనున్నారు. ఇక జిల్లాకు 5,08,400 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 4,46,374 గోదాంలకు చేరాయి. ఇందులో 4,32,576 పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేశామని అధికారులు వెల్లడించారు.