ఆరు మట్టి టిప్పర్ల పట్టివేత ● | - | Sakshi
Sakshi News home page

ఆరు మట్టి టిప్పర్ల పట్టివేత ●

Apr 30 2025 12:17 AM | Updated on Apr 30 2025 12:17 AM

ఆరు మట్టి టిప్పర్ల పట్టివేత ●

ఆరు మట్టి టిప్పర్ల పట్టివేత ●

పాల్వంచరూరల్‌: అర్ధరాత్రి గుట్టుగా మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లను రెవెన్యూ అధికారులు సీజ్‌చేశారు. తహసీల్దార్‌ వివేక్‌ కథనం ప్రకారం.. మొర్రేడువాగు ఎగువభాగంలో ఉన్న గుడిపాడు సమీపం నుంచి సోమవారం అర్ధరాత్రి మట్టిని ఆరు టిప్పర్లలో పాల్వంచకు తరలిస్తున్నారు. సమాచారం అందడంతో ఆర్‌ఐలను ఘటనా స్థలానికి పంపగా అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న ఆరు టిప్పర్లను పట్టుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించి, వాహనాలకు జరిమానా విధించనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

దమ్మపేట: పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని మందలపల్లిలో చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన కుప్పాల శ్రీను (24)కు గతేడాది వివాహం కాగా ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో అతడి తండ్రి, భార్య ఈ నెల 27న మందలించగా.. శ్రీను పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు సత్తుపల్లిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి. .అక్కడి నుంచి ఏపీలోని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.

చికిత్స పొందుతున్న

బాలిక మృతి

దుమ్ముగూడెం: మండలంలోని జడ్‌.వీరభద్రారం గ్రామానికి చెందిన బాలిక పురుగులమందు తాగి.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. బాలిక 5 రోజుల కిందట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతున్న యువతి..

సుజాతనగర్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందిన ఘటనపై సుజాతనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ రమాదేవి కథనం మేరకు.. మండలంలోని మంగపేట గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్ల కిందట పదో తరగతి ఫెయిల్‌ అవ్వడంతో చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. పొలం పనికి రావడం లేదు.. ఇంట్లో పని కూడా చేయడం లేదంటూ ఈ నెల 14న ఆమెను తన తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యువతి పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement