
విజేతగా భద్రాద్రి గాయకుడు
భద్రాచలంటౌన్: ఖమ్మం జిల్లా ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యాన జిల్లాస్థాయిలో నిర్వహించిన సినీ హంగామ సమ్మర్ స్పెషల్ సినీ ట్రాక్ సింగింగ్ పోటీల్లో భద్రాద్రి గాయకుడు పోకల శ్రీనివాస్ విజేతగా నిలిచాడు. ఈపోటీల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 75 మంది గాయనీ గాయకులు పాల్గొనగా.. శ్రీనివాస్ విజేతగా గెలిచి రూ.5వేల ప్రోత్సహక బహుమతి అందుకున్నాడు. న్యాయ నిర్ణేతలుగా రాజాబాబు, సరళ వ్యవహరించారు.
బైక్లను ఢీకొన్న లారీ..
● ఒకరి మృతి
నేలకొండపల్లి: బైక్ను ఢీకొట్టిన లారీ.. తప్పించుకునే క్రమంలో మరో బైక్ను ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బోదులబండ అండర్పాస్ వద్ద రాజస్థాన్కు చెందిన, క్వారీలో పనిచేసే కూలీల బైక్ను లారీ ఢీకొట్టింది. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో లారీని వేగంగా నడుపుతూ డ్రైవర్.. కొద్దిదూరంలో మరోబైక్ను ఢీకొట్టాడు. దీంతో మొదటి బైక్పై వస్తున్న రాజస్తాన్ కూలీల్లో హరికిరణ్ (36) మృతిచెందాడు. అదే ప్రమాదంలో రాజ్బహుదూర్, రాంజీలాల్, మరో బైక్పై వస్తున్న తిరుమలాపురం గ్రామానికి చెందిన భూక్యా వెంకటసాయి తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. లారీడ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
చెన్నారంలో చోరీలు..
నేలకొండపల్లి: మండలంలోని చెన్నారంలో రెండు ఇళ్లలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని చెన్నారంలో మూడు రోజుల కిందట కందగట్ల కృష్ణ, బోయినపల్లి వేణు నివాసాల్లో చోరీ జరిగింది. తలుపులు పగలగొట్టి.. బీరువాలో ఉన్న నగదును చోరీ చేశారు. రెండిళ్లలో కలిపి రూ.6 వేల వరకు నగదు చోరీకి గురవగా.. ఆదివారం బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రులు
మందలించారని
యువకుడు ఆత్మహత్య
నేలకొండపల్లి: ఖరీదైన మొబైల్ కొన్నందుకు తల్లిదండ్రులు మందలించారని.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని శంకరగిరితండాకు చెందిన ధరావత్ రాజు (24) రెండు రోజుల కిందట ఖరీదైన మొబైల్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంత ఖరీదు పెట్టి ఎందుకు కొనుగోలు చేశావని.. పైగా ఏపని చేయటం లేదని.. తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన రాజు పురుగులమందు తాగగా కుటుంబసభ్యులు ఖమ్మం వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడు అదృశ్యం
చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన 64 ఏళ్ల తుడుం బక్కయ్య కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. గత నెల 20వ తేదీన కటింగ్ చేయించుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బక్కయ్య తిరిగి రాలేదు. బక్కయ్య కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
బైక్ దొంగను పట్టుకున్న స్థానికులు
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో బైక్ను దొంగిలించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఆదివారం స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానిక తూర్పు బజారు వాసి కొడమంచిలి రాజు ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన బల్లెం నాగేశ్వరరావు దొంగిలించే ప్రయత్నించాడు. గమనించి పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలోనే నాగేశ్వరరావుపై ఏపీలో దొంగతనం కేసులున్నట్లు గుర్తించామని, విచారించి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ యయాతి రాజు తెలిపారు.

విజేతగా భద్రాద్రి గాయకుడు

విజేతగా భద్రాద్రి గాయకుడు