బాపట్ల: ఏపీఐఐసీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుల నిర్మాణం వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించడానికి వీలవుతుందని కలెక్టర్ చెప్పారు. నిజాంపట్నం, వేటపాలెం, అమర్తలూరు, పర్చూరు, బాపట్ల మండలాలలో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం చేపట్టాలన్నారు.


