గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన మినీ గోకులాల నిర్మాణాలు నిర్దేశించిన సమయంలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వర్చువల్గా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 390 మినీ గోకులాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో 284 నిర్మాణాలు పూర్తి చేసామన్నారు. మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈ నెల చివరి నాటికి మొత్తం పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ జ్యోతిబసు, పంచాయతీరాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, డ్వామా పీడీ శంకర్ అధికారులు పాల్గొన్నారు.