నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌ రాక

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

మూడు రోజులపాటు పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

తొలిరోజు ప్రజలతో మమేకం

24న భూమయ్యగారిపల్లె

గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి

విగ్రహ ప్రతిష్టకు హాజరు

పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2.40గంటలకు బెంగుళూరులోని యలహంకలో ఉన్న తన నివాసం నుంచి బెంగుళూరులోని జక్కూర్‌ ఎయిర్‌డ్రోంకు బయలుదేరుతారు. 3గంటలకు బెంగుళూరు ఎయిర్‌డ్రోం నుంచి హెలీకాప్టర్‌ ద్వారా బయలుదేరి 3.30గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 3.50గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7గంటల వరకు క్యాంపు ఆఫీస్‌లో ప్రజలతో మమేకమవుతారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

● 24వ తేదీ బుధవారం ఉదయం 9.00గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బయలుదేరుతారు. 10 గంటలకు ఆలయానికి చేరుకుంటారు. 11.00గంటల వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందుల భాకరాపురంలోని తన క్యాంపు ఆఫీస్‌కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. మధ్యాహ్నం 1గంటకు భాకరాపురంలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7గంటల వరకు తన క్యాంప్‌ ఆఫీస్‌లో వైఎస్‌ జగన్‌ ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నారు.

● 25వ తేదీ ఉదయం 8.10గంటలకు భాకరాపురంలోని హెలీప్యాడ్‌ నుంచి బెంగళూరుకు తిరుగుపయనమవుతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement