మేము రెండేళ్లుగా ఇక్కడ కాపురం ఉంటున్నాము. అయితే మాకు, మా పిల్లలకు కావాల్సిన వసతులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాము. కనీసం ఇన్ని ఇళ్లకు ఒక ఆస్పత్రి కూడా ఏర్పాటు చేయలేదు. బడి లేదు. చిన్న పిల్లలను బడికి పంపాలంటే సుమారు 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే బడి ఏర్పాటు చేయాలి. ఏదైనా జబ్బు చేస్తే రాయచోటి ఆస్పత్రులకు ఆటో ద్వారా వెళ్లాల్సి వస్తోంది. సామూహికంగా పూజలు చేసుకొనేందుకు గుడి లేదు. మూడు రోజుల క్రితం ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో మా ఇంటిలోకి పాము వచ్చింది. వీధిలైట్లు వెలుగుతూ ఉంటే పాముల భయం ఉండదు. – ఝాన్సీ, లబ్ధిదారురాలు, జగనన్న కాలనీ.


