బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

మదనపల్లె సిటీ : బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద మున్సిపల్‌ ఉన్నత పాఠశాల(మాయబజార్‌ ), స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ‘మన బడి – మన పండుగ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు చాక్‌లెట్లు పంచి పెట్టి స్వాగతం పలికారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఈ ఏడాది కొత్తగా 1వ తరగతిలో 9,559 మంది చేరినట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన జరుగుతుందన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, హెచ్‌ఎం సుబ్బారెడ్డి, హెచ్‌ఎం రాజేంద్రప్రసాద్‌, ఉపాధ్యాయులు పురం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement