ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించండి

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

జేసీ శివ్‌నారాయణశర్మ

మదనపల్లెఅర్బన్‌: ప్రజా అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణశర్మ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్‌ లేకుండా అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే గ్రీవెన్స్‌పై ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలన్నారు. కాగా గ్రీవెన్స్‌సెల్‌లో మొత్తం 371 అర్జీలను స్వీకరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్‌, ఏడీ భరత్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అర్జీల వివరాలు..

● గ్రామానికి మంజూరైన పంచాయతీ భవన నిర్మాణానికి పట్టణానికి వలస వెళ్లిన చలపతి, సాంబశివ సోదరులు అడ్డుపడుతున్నారని తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి గ్రామస్తులు జేసీకి అర్జీ అందజేశారు. ఈ విషయంలో ఎంపీడీవో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దాంతో ఆక్రమణదారులు అడ్డుపడుతున్నట్లు వివరించారు.

● స్మార్ట్‌ కిచెన్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జేసీకి అర్జీ సమర్పించారు మధ్యా హ్న భోజన పథకాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తే కార్మికులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement