జిల్లాలో వరి తరువాత హార్టికల్చర్లో అరటి ఎక్కువగా పండిస్తారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉంటుండటంతో రైతులు అరటి పంటను నాటేందుకు జంకుతున్నారు. మెలకువలు తెలిసిన కొందరు పొలంలో ఎండ వేడిమి బారిన పడకుండా న్యూస్ పేపర్లను మొక్కలపై ఉంచి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ పద్ధతిలో మొక్క ఎండకుండా పెరిగి పంట సాగుకు వస్తుంది. చెన్నూరు –ఖాజీపేట మధ్యలో ఇలా సంరక్షణతో పంట పండిస్తున్న దృశ్యాలు అబ్బుర పరుస్తున్నాయి. – ఫొటో గ్రాఫర్, సాక్షి, కడప


