మావిగన్పై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఎంత విషప్రచారం చేసినా.. వాస్తవాలను వైఎస్సార్సీపీ ప్రజలకు వివరిస్తుండటంతో ప్రజలు చంద్రబాబు కుటిల ప్రయత్నాలను అర్థం చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి పొట్టిపాటి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మావిగన్ ప్రయోజనాలను తెలుపుతూ కడపలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ‘మావిగన్.. రాష్ట్రానికి మంచి విజన్’ అంటూ వారు పేర్కొంటుండటం విశేషం. – కడప కార్పొరేషన్


