కొత్త పింఛన్ల ఊసే లేదు
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీల పేరుతో ప్రజలను మభ్య పెట్టడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం చంద్రబాబు నైజం. బూటకపు హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో బాబు సిద్దహస్తుడని ఇటీవల ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్టే నిదర్శనం. సంక్షేమం పేరుతో బాబు సర్కార్ అంకెల గారడి చేసింది. నిరుద్యోగ భృతి అమలు, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్ల జాడే లేదు. భర్తలు చనిపోయిన వితంతువులకు ఇంత వరకు కొత్త పింఛన్ల ఊసే లేదు. ఇప్పటికై నా ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి సారించాలి.
– కేవీ రమణ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ,
పెద్దతిప్పసముద్రం మండలం
కొత్త పింఛన్ల ఊసే లేదు


