కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమే.. అయినప్పటికి జిల్లాలో ఎక్కడాకూడా స్టాపింగ్‌ లేకపోవడంతో ఆశలు నిరాశలు మిగిలాయి. రైల్వేలో చివరి స్టేషన్‌ అయిన కాట్రా వరకు రైలు వెళుతుంది. దేశంలో పేరొందిన వైష్ణవ ఆలయం వరకు ఈ రైలులో వెళ్లవచ్చు. ఆధునిక వ | - | Sakshi
Sakshi News home page

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమే.. అయినప్పటికి జిల్లాలో ఎక్కడాకూడా స్టాపింగ్‌ లేకపోవడంతో ఆశలు నిరాశలు మిగిలాయి. రైల్వేలో చివరి స్టేషన్‌ అయిన కాట్రా వరకు రైలు వెళుతుంది. దేశంలో పేరొందిన వైష్ణవ ఆలయం వరకు ఈ రైలులో వెళ్లవచ్చు. ఆధునిక వ

Jun 21 2025 3:31 AM | Updated on Jun 21 2025 3:31 AM

కశ్మీ

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమ

రాజంపేట: తొలిసారిగా జిల్లా మీదుగా తిరుపతి నుంచి జమ్ముతావి వరకు ఆధునికసౌకర్యాలతో నడిచే రైలులో ప్రయాణించే భాగ్యం లేకుండాపోయింది. దేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి కశ్మీరు ప్రాంతంలో పేరొందిన వైష్ణవ క్షేత్రం వరకు నడిచేలా రైలు రాకపోకలను రూపొందించారు. రాజంపేట, కడప నుంచి నేరుగా కశ్మీరుకు వెళ్లేందుకు హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులోకి ఉన్నప్పటికి అందుల్లో వెళ్లేందుకు వీలులేకుండాపోయింది. రేణిగుంట నుంచి గుంతకల్‌ వరకు వన్‌రన్‌తో ఈ రైలు నడుస్తోంది. ఈ రైలుపై రైల్వే పెట్టుకున్న ఆదాయం వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది.

ఖాళీగా థర్డ్‌ ఏసీ బోగీలు :

హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పార్మిసిన్‌ పూర్తిగా థర్డ్‌ ఏసీ కోచ్‌లతో నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ బోగీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అరకొర ప్రయాణికులతో ఏసీబోగిలు కనిపిస్తున్నాయి. 22705/ 22706నెంబర్లతో ఈ రైలును నడిపిస్తున్నారు. వారంలో ఒకరోజు మాత్రమే ఈ రైలు జిల్లా వాసులకు అందుబాటులో ఉన్నప్పటికి జిల్లాలో రైలు మార్గంలో సింగల్‌రన్‌ కావడంతో , అది మంగళవారం కావడంతో ఈ రైలులో ప్రయాణం జరగకపోవడం కారణమని, ఆదివారం రన్‌ జరిగితే కొంతైన ఎర్నింగ్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.

జిల్లా వాసులకు దక్కని

ఆధునికసౌర్యాల బండి

తిరుపతి–హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌రైలులో పూర్తిగా ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటాయి. ప్రయాణికులకు ఏలాంటి బోరు కొట్టుకుండా కొనసాగేలా రైల్వే సౌకర్యాలను ఏర్పాటు చేసింది. రైలు రన్నింగ్‌ సమయంలో ఏ స్టేషన్‌ వస్తుందో ముందుగానే తెలియచేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రయాణికుల కోసం అత్యాధునికంగా బెర్త్‌లు ఉన్నాయి. సీసీ టీవీ, జీపీఎస్‌ ద్వారా ప్రయాణికులకు సమాచారం. బ్రైలీడిస్‌ప్లేస్‌, ఫైర్‌ అండ్‌ స్మోక్‌ డిటెక్టర్స్‌, మొబైల్‌, ల్యాప్‌టాప్‌చార్జ్‌ సౌకర్యం ఉన్నాయి. అయితే ఇవన్ని అనుభవిస్తూ ప్రయాణించేందుకు జిల్లా వాసులకు అవకాశం లేకుండాపోయింది.

జిల్లా మీదుగా హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌

నోస్టాపింగ్‌తో..పరుగులు

రేణిగుంట టు గుంతకల్‌ వన్‌రన్‌న్‌

పార్లమెంటరీ స్టేషన్లో హాల్టింగ్‌ ఇవ్వాలి

కశ్మీర్‌ రైలులో ప్రయాణించేఅవకాశం కల్పించాలి

జిల్లా వాసులకు దక్కని ఆధునిక సౌకర్యాలబండి

కడప, రాజంపేటలో హాల్టింగ్‌ ఇవ్వాలి :

పార్లమెంటరీ స్టేషన్లు అయిన కడప, రాజంపేటలో తిరుపతి–జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు హాల్టింగ్‌ ఇవ్వాలి. ఆ దిశగా ఇప్పటికే గతంలో కడప, రాజంపేట ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి రైల్వేశాఖను కోరారు. మళ్లీ ఈ రైలు హాల్టింగ్‌కు మళ్లీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మిధున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళతాం. హాల్టింగ్‌ విషయంలో పార్లమెంటరీ స్టేషన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.

–తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు, రాజంపేట

హాల్టింగ్‌ ఇస్తే ఉభయ జిల్లా వాసులకు అనుకూలం

తిరుపతి నుంచి జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు రాజంపేట, కడపలో స్టాపింగ్‌ ఇవ్వాలి. కడప మీదుగా వెళ్లే ఈ ఆధునిక బండిలో ప్రయాణం బాగుంటుంది. కనీసం రెండు స్టేషన్లలో హాల్టింగ్‌ ఇస్తే ఉభయ జిల్లా వాసులకు అనుకూలంగా ఉంటుంది. రైల్వేశాఖ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోని స్టేషన్లకు గుర్తింపు ఇచ్చేలా హాల్టింగ్స్‌ను ఇవ్వాలి. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు రైలు హాల్టింగ్‌ కోసం కృషి చేయాలి.

–కేఎంఎల్‌ నరసింహ, ఆల్‌ఇండియా ఓబీసీ ఫ్రంట్‌ కన్వీనర్‌

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమ1
1/4

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమ

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమ2
2/4

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమ

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమ3
3/4

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమ

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమ4
4/4

కశ్మీరు లోయలు..అందాలు చూడాలనుకునే వారికి ఈ రైలు అనుకూలమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement