
బ్రహ్మంగారి హుండీ ఆదాయం రూ.32లక్షలు
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మంద్రస్వామి మఠంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు.మూడునెలల్లో భక్తులు సమర్పించిని కానుకలను లెక్కించగా రూ.32లక్షలు నగదు, 13 గ్రాముల బంగారం, 280గ్రాములు వెండి ఆభణాలు వచ్చినట్లు దేవస్థానం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పరిపాలనా అధికారి శంకర్బాలాజీ, ఎండోమెంట్ అధికారులు, పూర్వపు మఠాధిపతి కుమారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వైద్య సేవలు మెరుగు పడాలి
ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ రమేష్నాథ్ తెలిపారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు. వార్డులను తనిఖీ చేసి అక్కడి ఇన్పేషెంట్లతో రమేష్నాథ్ మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో పారిశుధ్యం సరిగా లేదని మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఓపీ విభాగాలు అపరిశుభ్రంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సిబ్బంది, వైద్యుల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలోని సమస్యలపై మెడికల్ సూపరింటెండెంట్ శ్రీవాణి, వైద్యులు ఆనంద్బాబులతో చర్చించారు. కార్యక్రమంలో వైద్యులు గోపాల్, రూపానంద్, నర్సింగ్ సూరింటెండెంట్ రాణమ్మ, అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.