
దరఖాస్తుల ఆహ్వానం
రాజంపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో మిగిలివున్న సీట్ల భర్తీ కోసం రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్ సి.రామ్మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై ఆసక్తిగల అభ్యర్థులు జూలై 12వ తేదీలోపు www.iti.a p.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం తమకు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలలో విధిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే మెరిట్ జాబితాలోకి వస్తారన్నారు. అర్హులైన అభ్యర్థులకు జూలై 21వ తేదీ కౌన్సె లింగ్ ఉంటుందని, ఆ కౌన్సెలింగ్లో అభ్యర్థులు ఖాళీలను బట్టి తమకు నచ్చిన ఐటిఐ, ట్రేడ్లను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.
డిజిటల్ అసిస్టెంట్ సస్పెన్షన్
బి.కొత్తకోట: మండలంలోని వడిగలవాండ్లపల్లె సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫకృద్దీన్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వు జారీ చేశారు. బుధవారం గుండ్లవారిపల్లె గ్రామానికి చెందిన అనూరాధ, శంకర, నాగభూషణంలు తల్లికి వందనం పథకం గురించి ఆరా తీసేందుకు సచివాలయం వచ్చారు. ఆక్కడ పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫకృద్దీన్ సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపై దాడి చేసి గాయపరచినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ శ్రీధర్ గురువారం గుండ్లవారిపల్లెకు వెళ్లి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ కృష్ణవేణి బాధితులు, గ్రామస్తులను విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ శ్రీధర్ మదనపల్లె సబ్కలెక్టర్ను విచారణ అధికారిగా నియమించారు.
స్కిల్హబ్ సెంటర్ ద్వారా ఉపాధి కల్పన శిక్షణ
రాయచోటి టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ( ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నికల్ స్కిల్ హబ్ సెంటర్లోని వెబ్ డెవెలపర్, టైలరింగ్లో శిక్షణ నిర్వహించి ఉపాధి కల్పించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ పి. శివశంకర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు తమ పేరును రిజిష్టేన్ చేసుకోవాలని కోరారు. స్కిల్ హబ్ సెంటర్ కోర్సు మూడు నెలలు కాలపరిమితి ఉంటుందని, దీనికి ఇంటర్ లేదా దైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చున్నారు. అలాగే టైలరింగ్ కోర్సు మూడు నెలల కాలపరిమితి ఉంటుందని, దీనికి 10వ తరగతి పాస్ లేదా ఫేయిలైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తిరుపతి నుంచి మదనపల్లికి స్పెషల్ ప్యాసింజర్ రైలు
కలికిరి: తిరుపతి నుంచి మదనపల్లి వరకు స్పెషల్ ప్యాసింజర్ రైలును ఈ నెల 25 నుంచి జూలై నెల 31వ తేదీ వరకు నడుపనున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలో ఉదయం 5.15 గంటలకు బయల్దేరే స్పెషల్ ప్యాసింజరు (07261) పాకాలకు 05.55 గంటలకు, పీలేరు కు 6.25 గంటలకు కలికిరికి 6.40 గంటలకు మదనపల్లికి 8.15 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మదనపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు స్పెషల్ ప్యాసింజరు(07262) కలికిరి 3.30 గంటలకు, పీలేరుకు 03.57 గంటలకు, పాకాలకు 4.50 గంటలకు, తిరుపతికి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. కాగా తిరుపతి–గంటూరు ఎక్స్ప్రెస్ను మదనపల్లి వరకు పొడిగించి తాత్కాలికంగా స్పెషల్ ప్యాసింజరుగా నడుపనున్నారు. ఆగస్టు నెల నుంచి ఇదే రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఉద్యోగాలకు ఎంపిక
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ప్రముఖ కంపెనీలైన ఎల్ అండ్ టి, కోల్గేట్, రానే టెక్నాలజీస్, సిస్కోల్, గ్రీన్టెక్, షిర్డిసాయి కంపెనీ, టివిఎస్, ఆపోలా ౖటైల్స్, చానెల్ప్లే, జాన్డీర్, ఆటోమోటివ్, అమర్రాజా, కియా కంపెనీలు పాల్గొన్నాయని ప్రభుత్వ ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. ఈ జాబ్మేళాకు జిల్లావ్యాప్తంగా 312 మంది విద్యార్థులు హాజరుకాగా వివిధ ట్రేడ్స్కు సంబంధించి 256 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు జ్ఞానకుమార్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న వారిని జ్ఞానకుమార్తోపాటు పలు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాళ్లు అభినందించారు.