రాయచోటి అర్బన్ : వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సేవలు మరువలేనివని అడిషనల్ డీఎంఅండ్హెచ్ఓ శైలజ, ఆర్ఐఓ ఉషశ్రీ అన్నారు. రాయచోటిలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్ కొండయ్యకు స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండయ్య విధులను అంకితభావంతో నిర్వర్తించడంతోపాటు ఉద్యోగుల పట్ల సానుకూలతతో వ్యవహరించారన్నారు. క్రమశిక్షణ, నిజాయితీకి మారు పేరుగా నిలిచారన్నారు. డాక్టర్ కొండయ్య మాట్లాడుతూ ఉద్యోగులంతా నిబద్ధతతో పనిచేసి తగు గుర్తింపు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో రియాజ్బేగ్, విష్ణువర్దన్రెడ్డి, దేవశిరోమణి, ఓబుళరెడ్డి, రవికుమార్, మునీవర్, ప్రసాద్, ప్రసాద్యాదవ్, వెంక టేశ్వర రెడ్డి, దేవేంద్ర, బలరాం, మహాదేవ, వేణుగోపాల్రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.