సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి దళిత గళ సమ్మేళనం శనివారం నిర్వహిస్తున్నట్లు పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు తెలిపారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.


