రేపు నెల్లూరుకు వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy To Visit Nellore On July 04, Check Schedule Details Inside | Sakshi
Sakshi News home page

రేపు నెల్లూరుకు వైఎస్‌ జగన్‌

Jul 3 2024 5:30 AM | Updated on Jul 3 2024 11:51 AM

YS Jagan Mohan Reddy to Visit Nellore on July 04

సెంట్రల్‌ జైల్లో ఉన్న పిన్నెల్లితో ములాఖత్‌

సాక్షి,అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం నెల్లూరుకు రానున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9.40గంటలకు హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని హెలి­ప్యాడ్‌కు చేరుకుంటారని చెప్పారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నెల్లూరు సెంట్రల్‌ జైల్‌ చేరుకుని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన అనంతరం మధ్యాహ్నం 12గంటలకు తిరిగి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో తాడేపల్లి వెళతారని పేర్కొన్నారు.  

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం
రోడ్డు మార్గంలో తాడేపల్లికి పయనం
సాక్షి,అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): బెంగళూరు పర్యటన ముగించుకుని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి వైఎస్‌ భారతీ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం మధ్యాహ్నం 2.50గంటలకు ఇక్కడికి చేరుకున్నారు.

విమా­­నా­శ్రయంలో జగన్‌కు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌ కుమార్, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు దేవినేని అవినాశ్, షేక్‌ అసిఫ్, అంబటి మురళీకృష్ణ, ఏపీ ఫైబర్‌నెట్‌ మాజీ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జై జగన్‌.. నినాదాలతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతమంతా మార్మోగింది. వీరందరిని వైఎస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement