ఏపీ: జూన్‌ 15 నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల | Water Release To Godavari Delta From June 15 | Sakshi
Sakshi News home page

ఏపీ: జూన్‌ 15 నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల

May 28 2021 12:09 PM | Updated on May 28 2021 12:09 PM

Water Release To Godavari Delta From June 15 - Sakshi

 గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ పంటల సాగు కోసం జూన్‌ 15 నుంచి నీటిని విడుదల చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

సాక్షి, అమరావతి:  గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ పంటల సాగు కోసం జూన్‌ 15 నుంచి నీటిని విడుదల చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ పంటలకు నీటిని విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు చింతా అనురాధ, మార్గాని భరత్, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో  గురువారం ఆయన వర్చువల్‌ విధానంలో సమావేశం నిర్వహించారు.

చదవండి: కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం
యాస్‌ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement