యూకేజీ విద్యార్థిని కొట్టి చంపిన టీచర్‌ | Tragic Death of Schoolboy in Visakhapatnam | Sakshi
Sakshi News home page

యూకేజీ విద్యార్థిని కొట్టి చంపిన టీచర్‌

Aug 20 2026 3:01 PM | Updated on Aug 20 2026 3:37 PM

  Tragic Death of Schoolboy in Visakhapatnam

విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రణయ తేజ అనే చిన్నారిని స్కూల్ టీచర్ చితకబాదింది. దెబ్బలు తాళలేక ప్రణయ తేజ మృతి చెందాడు. కేజీహెచ్‌ వద్ద ఆ బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. వారితో పోలీసులు మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రణయ తేజ వన్ టౌన్ లిటిల్ గార్డెన్ స్కూల్‌లో యూకేజీ విద్యార్థి. టీచర్‌ కొడుతుంటే అతడు బాగా భయపడిపోయి, కుప్పకూలి అక్కడే మృతి చెందాడు.  

విశాఖలో ఈ విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్కూల్‌ వద్ద కూడా ఆ చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. టీచర్‌ను పోలీసులు అరెస్టు చేసి, కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement