Sajjala Ramakrishna Reddy Comments After Met With CM YS Jagan - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో భేటీ అనంతరం సజ్జల కీలక వ్యాఖ్యలు

Apr 27 2022 6:14 PM | Updated on Apr 27 2022 6:46 PM

Sajjala Ramakrishna Reddy Comments After Met With CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాబోయే రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వారంలో 2, 3 రోజులు ప్రజల్లో ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం జగన్‌ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

సమావేశం అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం కార్యాచరణ నిర్దేశించారు. ఎన్నికలకు ముందు ఓ ఆలోచనా విధానంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలు వారంలో 2,3 రోజులు ప్రజల్లో ఉండాలి. ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలి. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తాం. ఉద్యోగులపై ప్రభుత్వం పాజిటివ్‌గా ఉంది. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వం బాధ్యత' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

చదవండి: (సీఎం జగన్‌ అధ్యక్షతన కీలక సమావేశం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement