బియ్యం లేవట.. డబ్బులు తీసుకోవాలట..! | Ration Dealer In Prakasam District Says Take Money Instead Rice | Sakshi
Sakshi News home page

బియ్యం లేవట.. డబ్బులు తీసుకోవాలట..!

Aug 3 2025 7:41 AM | Updated on Aug 3 2025 7:47 AM

Ration Dealer In Prakasam District Says Take Money Instead Rice

థంబ్‌ వేయించుకుని డబ్బు చెల్లించిన రేషన్‌ డీలర్‌

తర్లుపాడు: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చౌకబి­య్యం దళారులు, అధికార కూట­మి నేతలకు ఆదాయ వనరుగా మారింది. 1న కార్డుదారులకు అందుబాటు­లో ఉండి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల్సిన డీలర్‌ ఇంటింటికీ తి­రిగి బయోమెట్రిక్‌ థంబ్‌ వేయించుకుని ‘రేషన్‌ లేదు.. డబ్బు­లు తీ­స్కోండి’ అంటూ కార్డుదారు­లపై మండిపడటం.. ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది.

మండలంలోని కేతగుడిపి పంచాయతీలో సుమారు 1100 మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ 1న రేషన్‌ అందించాల్సిన డీలర్‌ తన కుమారుడు ద్వారా బియ్యం లేవంటూ కార్డుదారుల నుంచి థంబ్‌ వేయించుకుని కిలోకు రూ.10 చొప్పున డబ్బు చెల్లించారు. ఇదేమని అడిగేందుకు సాహసించని కార్డుదారు­లు ఇచి్చనకాడికి తీసుకొన్నారు. గతంలో రేషన్‌ బియ్యాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కార్డుదారుల ఇళ్లకు వెళ్లి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రేషన్‌ డీలర్లే అధికార పార్టీ నేతల అండతో బియ్యం ఇవ్వకుండా నేరుగా మార్కెట్‌కు తరలిస్తుండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement