Sakshi News home page

సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం

Published Thu, Mar 7 2024 2:38 AM

Presentation of Sangeet and Natak Akademi Awards - Sakshi

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురికి అందజేసిన రాష్ట్రపతి ముర్ము

సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం: సంగీత, నృత్య, నా­టక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పలువు­రికి సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రప­తి ద్రౌ­పది ముర్ము ప్రదానం చేశారు. బుధవారం వి­జ్ఞా­న్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 20­2­2, 2023 సంవత్సరాలకు గానూ విజేతలకు రాష్ట్ర­పతి పురస్కారాలు బహూకరించారు. ప్రము­ఖ కూచిపూడి నృత్యకారులు రాజా–రాధారెడ్డి 2022­–­23 గాను సంగీత నాటక అకాడమీ ఫెలో­షిప్‌ అందుకున్నారు. వీరితోపాటు.. ఆంధ్రప్రదేశ్‌­లోని గూ­డూరుకు చెందిన వినుకొండ సుబ్ర­హ్మ­ణ్యం 2022 సంవత్సరానికి కర్ణాటక ఇనుస్ట్రుమెంటల్‌ మ్యూ­జిక్‌ (తవిల్‌) విభాగంలో అవార్డు అందుకున్నారు.

కర్నూలుకు చెందిన మద్దాలి ఉషాగా­యత్రి కూచి­పూడి రంగంలో 2023 సంవత్సరా­నికి, అవనిగ­డ్డకు చెందిన ఎల్‌వీ గంగాధరశాస్త్రి సుగం సంగీ­త్‌లో 2023 సంవత్సరానికి, కర్ణాటక గాత్ర సంగీ­తంలో పేరుగాంచిన విశాఖకి చెందిన మం­డ (ఆ­లమూరు) సుధారాణి 2022 సంవత్స­రానికి పుర­స్కా­రాలు అందుకున్నారు. తెలంగాణ­లోని ఎల్లా­రెడ్డి­పేటకు చెందిన పేరిణి ప్రకాష్‌ పేరిణియాట్టంలో 2023 సంవత్సరానికి, హైదరా­బాద్‌కు చెందిన భాగవతుల సేతురామ్‌ కూచిపూ­డి నృత్యంలో 2022 సంవత్సరానికి అవార్డు అందుకున్నారు. 

Advertisement
Advertisement