నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జనసేన నేత కీచక పర్వం బయటపడింది. జనసేన నేత వెంకటరాజు.. బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అయితే ఆ బాలిక తప్పించుకుని గోదావరిలో దూకి ఆత్మహత్యయత్నం చేసింది.
అయితే ఆ మైనర్ బాలికను స్థానికులు రక్షించారు. దీనిపై పీఎస్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసుల తీరుపై జేసీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు.


