K Raheja Group President Neel Raheja Meet CM Jagan - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా భేటీ..

Jul 18 2023 8:00 PM | Updated on Jul 18 2023 8:16 PM

K Raheja Group President Neil Raheja Met CM Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆయనతో పాటు ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈఓ రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి రావాలని సీఎం జగన్‌ను కె రహేజా గ్రూపు ప్రతినిధులు ఆహ్వానించారు.

కాగా విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మించనున్నారు. మూడేళ్లలో కె రహేజా గ్రూప్‌ రాష్ట్రంలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఏపీలో మరిన్ని పెట్టుబడులపై సీఎం జగన్‌తో రహేజా గ్రూప్‌ ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌లు పాల్గొన్నారు. 
చదవండి: పెద్ద కష్టం తీరింది.. సర్వీస్‌ ఈనాం భూములపై సర్వ హక్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement