‘పెద్దన్న’తో విన్యాసాలు | India US military exercises to be held in Visakhapatnam for the fourth time | Sakshi
Sakshi News home page

‘పెద్దన్న’తో విన్యాసాలు

Mar 29 2025 5:01 AM | Updated on Mar 29 2025 5:01 AM

India US military exercises to be held in Visakhapatnam for the fourth time

విశాఖ వేదికగా నాలుగోసారి భారత్‌–అమెరికా యుద్ధ విన్యాసాలు 

త్రివిధ దళాలతో సంయుక్తంగా  టైగర్‌ ట్రయాంఫ్‌–2025 

ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభం 

ఉగ్రవాదానికి హెచ్చరికలు పంపేలా విన్యాసాలు 

ట్రంప్‌ వచ్చిన తర్వాత నిర్వహిస్తుండటంతో అన్ని దేశాల్లోనూ ఆసక్తి 

సాక్షి, విశాఖపట్నం: అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపడేలా.. దాయాది దేశాల్లో వేళ్లూనుకుంటున్న ఉగ్రవాదానికి హెచ్చరికలు జారీ చేసేలా 2019 నుంచి నిర్వహిస్తున్న త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలకు విశాఖ నగరం మరోసారి ఆతిథ్యమిస్తోంది. ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభమయ్యే విన్యాసాల్లో భారత్‌ తరఫున ఐఎన్‌ఎస్‌ జలాశ్వ యుద్ధ నౌక ప్రాతినిధ్యం వహి­­స్తోంది. వరుసగా నాలుగో పర్యాయం విశాఖలోనే నిర్వహిస్తుండటం విశేషం.ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ త్రివిధ దళాల వి­న్యాసాలను ‘టైగర్‌ ట్రయాంఫ్‌’ గా పిలుస్తుంటారు.  

2019 నుంచి ప్రారంభం  
భారత్, అమెరికాల్లో సైనిక, వైమానిక, నౌకాదళ విన్యాసాలు వేర్వేరుగా జరిగాయి. కానీ 2019లో తొలిసారిగా..మూడు విభాగాలు కలిపి విన్యాసాల్లో ప్రప్రథమంగా పాల్గొనడంతో అన్ని దేశాలూ భారత్‌–అమెరికా మధ్య బంధం గురించి చర్చించుకున్నాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగు,  భద్రతా పరమైన అంశాల్లో పరస్పర సహకారం, విపత్తు సమయంలో ఒకరికొకరు సాయం చేసుకునేందుకు అవసరమైన విధానాలను బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. 

అనుమానాలను పటాపంచలు చేస్తూ.. 
ఈ ఏడాది జనవరిలో ఇరుదేశాల రక్షణ శాఖల అధికారులు సమావేశమై విన్యాసాలపై చర్చించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో..టైగర్‌ ట్రయాంఫ్‌ జరగదేమో అనుకున్నారంతా. 
కానీ  వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘టైగర్‌ ట్రయాంఫ్‌’– 4 ప్రారంభం కానుండటంతో ప్రధాన దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

టైగర్‌ ట్రయాంఫ్‌
వేదిక: విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం
ఎడిషన్‌:
ప్రారంభం: ఏప్రిల్‌ 02, 2025  

లక్ష్యం 
» ఇండో పసిఫిక్‌ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం 
»   ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా ఆయుధ సంపత్తి సత్తా చాటడం 
»   ఇండో–పసిఫిక్‌ జలాల్లో అక్రమ రవాణా, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట. 

విన్యాసాలు చేసేది.. వీళ్లే  
» అమెరికా తరపున  మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్‌లు 
» భారత్‌ సైనిక దళం, నావికులు, ఎయిర్‌మెన్‌లు 
»   భారత్‌ తరపున ఐఎన్‌ఎస్‌ జలాశ్వ  
»  అమెరికా యుద్ధ నౌకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement