AP: రైతు ఇంట మెరిసిన విద్యా‘మణి’

Farmesr Daughter Scored 991 Marks In Inter Exams MPC At YSR Kadapa - Sakshi

ఇంటర్‌ ఎంపీసీలో 1000కి 991 మార్కులు

పులివెందుల టౌన్‌ (వైఎస్సార్‌ జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన దేవమణి మంచి ప్రతిభ కనబరిచింది. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 991 సాధించింది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుడిపల్లెలో నివాసముంటున్న రైతు మధుసూదన్‌రెడ్డి, వరలక్ష్మి దంపతులకు వెంకట జితేంద్రారెడ్డి, దేవమణిలు సంతానం. దేవమణి పట్టణంలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివింది. తండ్రి కష్టాన్ని వృథా పోనివ్వకుండా దేవమణి అత్యుత్తమ ఫలితాన్ని సాధించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top