సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి రేపు(ఆదివారం, నవంబర్ 23) అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట శుభకార్యానికి హాజరు కానున్నారు. ప్రకాశ్ సోదరుడు రాజశేఖర్రెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరై.. నూతన జంటను వైఎస్ జగన్ ఆశీర్వదిస్తారని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.


