వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

CM YS Jagan Chittoor Visit On 2nd December - Sakshi

సాక్షి, చిత్తూరు: వరద ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించన్నారు. డిసెంబరు 2, 3 తేదీల్లో వరద ప్రభావిత వైఎస్సార్‌ కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతుంది.

డిసెంబరు 2న సీఎం జగన్‌ పర్యటన ఇలా..
► ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్సార్‌ కడప జిల్లా బయలుదేరనున్న సీఎం జగన్‌ 
► 10.50 గంటలకు వైఎస్సార్‌ కడప జిల్లా మందపల్లి(రాజంపేట) చేరుకోనున్న సీఎం
► అక్కడ నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి ​​​​​​​
► పుల్ల పొత్తూరు గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించనున్న సీఎం
​​​​​​​► సహాయశిబిరంలో ఉన్న బాధితులతో సీఎం ముఖామఖి.​​​​​​​
► మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకోనున్న సీఎం
​​​​​​​► అక్కడ నుంచి ఎగుమందపల్లి వెళ్లి.. గ్రామంలో వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో  స్వయంగా కాలినడకన  పర్యటించనున్న ముఖ్యమంత్రి 
​​​​​​​► ఎగుమందపల్లి నుంచి నేరుగా అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళ్లనున్న సీఎం జగన్‌.. దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలించినున్న సీఎం
​​​​​​​► వరద ప్రభావం ఫలితంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై సీఎంకు వివరాలందించనున్న అధికారులు​​​​​​​
► మధ్యాహ్నం 2.15 గంటలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం​​​​​​​
► సమీక్ష అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి  అక్కడ నుంచి రేణిగుంట మండలం వేదలచెరువు,  ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని, కాలనీ ప్రజలతో వరదనష్టంపై ముఖాముఖి, సమీక్ష నిర్వహించనున్న సీఎం​​​​​​​
► 4.30 గంటలకు ఏర్పేడు మండలం, పాపనాయుడు పేట గ్రామానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి
​​​​​​​► పాపనాయుడుపేటలో వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్న సీఎం
​​​​​​​► అక్కడ నుంచి తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్లనున్న సీఎం
​​​​​​​► వరద నష్టంపై బాధితులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి​​​​​​​
► అనంతరం పద్మావతి అతిధి గృహం, తిరుపతి చేరుకోనున్న ముఖ్యమంత్రి, సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం
​​​​​​​► రాత్రి పద్మావతి అతిధి గృహంలో బసచేయనున్న సీఎం జగన్‌.

డిసెంబరు 3 వ తేదీన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్‌.

►  డిసెంబరు 3వ తేదీ ఉదయం తిరుపతి, కృష్ణానగర్‌లో పర్యటించి, వరద నష్టాన్ని పరిశీలించడంతో పాటు స్ధానికులతో ముఖాముఖి.
►  వరద ప్రభావం గురించి తెలుసుకోనున్న  సీఎం.. అక్కడ నుంచి ఆటోనగర్‌లో పర్యటించనున్న ముఖ్యమంత్రి
►  అనంతరం ఉదయం 11 గంటలకు  నెల్లూరు జిల్లా బయలుదేరి వెళ్లనున్న సీఎం జగన్‌
►  నెల్లూరు రూరల్, దేవరపాలెం చేరుకుని, అక్కడ భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్డును, దెబ్బతిన్న వ్యవసాయ పంటలను పరిశీలించనున్న సీఎం
►  ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామానికి వెళ్లనున్న సీఎం జగన్‌
►  పెన్నానదీ వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలను పరిశీలించనున్న సీఎం 
►  అక్కడ నుంచి పెనుబల్లి జొన్నవాడ చేరుకుని, వరద ధాటికి కొట్టుకుపోయిన ఆర్‌ అండ్‌ బి రహదారిని, పంచాయతీరాజ్‌ రోడ్లతో పాటు ఇసుక మేటలు వేసిన వరిపొలాలను స్వయంగా పరిశీలించనున్న సీఎం
►  భారీ వర్షాలకు పంటలు, పశువులు నష్టపోయిన రైతులతో సీఎం ముఖాముఖి
►  మధ్యాహ్నం 1.15 గంటలకు నెల్లూరు నగరపాలక సంస్ధ పరిధిలో భగత్‌ సింగ్‌ కాలనీకి చేరుకోనున్న సీఎం
►  వరద ప్రభావంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించనున్న ముఖ్యమంత్రి.. అక్కడ నుంచి దర్గామిట్ట, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చేరుకుని వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్న సీఎం
► అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరద నష్టంపై సీఎం ఇంటరాక్షన్‌.. అనంతరం 3.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం
​​​​​​​► తిరిగి 4.20 గంటలకు రేణిగుంట నుంచి గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి తాడేపల్లి వెళ్లనున్న  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top