కోవిడ్‌ వల్లనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు | APNGO Leader Bandi Srinivasrao Comments On Financial difficulties | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వల్లనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు

Aug 18 2021 4:48 AM | Updated on Aug 18 2021 4:48 AM

APNGO Leader Bandi Srinivasrao Comments On Financial difficulties - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సంఘ నాయకులు

నెల్లూరు (అర్బన్‌): కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఛిన్నాభిన్నమైందని, అందుకే ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కాస్త ఆలస్యమయ్యాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దర్గామిట్టలోని ఎన్జీవో భవన్‌లో ఆ సంఘం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీతాలు కాస్త ఆలస్యం కావడానికి గత ప్రభుత్వం తెచ్చిన సీఎఫ్‌ఎంఎస్‌ విధానం కూడా మరో కారణమన్నారు.

ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ సీఎఫ్‌ఎంఎస్‌ వల్ల నష్టం జరుగుతుందని, ఈ విధానం పనికిరాదన్నారని గుర్తు చేశారు. అందువల్ల సీఎఫ్‌ఎంఎస్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అడగకుండానే ప్రభుత్వం 27 శాతం ఐఆర్‌ ఇచ్చిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించనుందన్నారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15న మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేస్తామని తెలిపారన్నారు. ఆ హామీని త్వరగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నేపల్లి పెంచలరావు, నాయుడు వెంకటస్వామి పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement