సమస్యలు పరిష్కరించాలంటూ రాజధాని రైతుల ధర్నా | Amaravati Capital farmers dharna demanding resolution of problems | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలంటూ రాజధాని రైతుల ధర్నా

Mar 24 2026 5:51 AM | Updated on Mar 24 2026 5:51 AM

Amaravati Capital farmers dharna demanding resolution of problems

తాడికొండ: రాజధానిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు, రైతు కూలీలు సోమ­వారం తుళ్లూరు మండలం రాయపూడిలో ధర్నా చేశారు. సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌ భార్గవ తేజకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజధాని రైతులకు, పేదలకు ఇచ్చే వార్షిక కౌలు, పెన్షన్లను మరో పదేళ్ల పాటు పొడిగిం­చాలని, పేదలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశా­రు. రిటర్నబుల్‌ ప్లాట్ల విషయంలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ, రాజధాని అభివృద్ధి వేదిక నేతలు వై.నేతాజీ, ఎం.రవి,  లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement